Monday, May 13, 2024

విపక్షాల కంటే దళితుల ప్ర‌యోజ‌నాలే ముఖ్యం – మంత్రి కొడాలి నాని..

గుడివాడ‌: అమరావతి పేరుతో దళితులను చంద్రబాబు నాయుడు మోసం చేశార‌ని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. బెదిరించి, భయపెట్టి దళితుల భూములను లాక్కున్నారని మండిపడ్డారు. గుడివాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఆంబోతుల అచ్చెన్నాయుడు, కుక్కల వెంకన్న అరుపులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు అండ్‌ కో భారీ భూస్కామ్‌లు చేశారన్నారు. ఏకపక్ష జీవోలతో దళిత వర్గాలను మోసం చేశారని ధ్వజమెత్తారు. దళితులను బెదిరించి చంద్రబాబు బ్యాచ్‌ కోట్లు కొట్టేశారన్నారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై సీఐడీ నోటీసులిస్తే తప్పేంటీ అని ప్రశ్నించారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ ఫాలో అవుతూ రాజకీయాలు చేసే ప్రతిపక్షాల కంటే తమకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement