Thursday, May 2, 2024

ప్ర‌శ్నిస్తే దేశ‌ద్రోహం కేసులు – మోడిపై రేవంత్ ఫైర్..

హైదరాబాద్: కేంద్ర ప్ర‌భుత్వాల‌పై ఎవ‌రు ప్ర‌శ్నించినా దేశ ద్రోహం కేసులు పెడుతున్నార‌ని కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి ఆరోపించారు..రైతు ఉద్య‌మానికి మ‌ద్ద‌తిచ్చార‌న్న ఒకే ఒక్క కార‌ణంతో దిశ ర‌విపై మోడీ ప్ర‌భుత్వం దేశ ద్రోహం కేసు న‌మోదు చేసిందంటూ ధ్వజమెత్తారు.. మీడియాతో రేవంత్ మాట్లాడుతూ, కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించినా, బాధ్య‌త గుర్తు చేస్తే వారిపై 124ఎ కింద కేసు న‌మోదు చేశారని చెప్పారు. చివ‌ర‌కు రైతు ర్యాలీలో పాల్గొన్న‌ రైతుల‌పై దేశ ద్రోహం కేసులు పెట్టారని మండిపడ్డారు. అదే స‌మ‌యంలో దేశ ద్రోహం కేసులు కోర్టుల్లో విచార‌ణ‌కు రాకుండా అడ్డుకుంటున్నార‌ని అన్నారు. కోర్టుల్లో కేసుల పెండింగ్‌తో ఉద్యోగాలు, పాస్‌పోర్టులు రాక యువ‌త ఇబ్బందులు ప‌డుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. 2014 నుంచి న‌మోదైన దేశ ద్రోహం కేసుల వివ‌రాలు వెల్ల‌డించాల‌ని అడిగితే కేంద్ర హోం శాఖ నుంచి ఇంత వ‌ర‌కు ఎటువంటి స్పంద‌న‌లేద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement