Thursday, May 2, 2024

కోడికత్తి రెడ్డి, తాపీకత్తి నాని బంద‌రుకు చేసిందేమిటి – సూటిగా ప్ర‌శ్నించిన లోకేష్..

తాడేపల్లి కోడికత్తి రెడ్డి ,బందరు తాపీకత్తి నాని అధికారంలోకి వచ్చి 21 నెలలు అయ్యింద‌ని, .బందరు లో పీకింది ఏంటి? అని టిడిపి జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సూటిగా ప్ర‌శ్నించారు… మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌లో భాగంగా ఆయ‌న నేడు బంద‌ర్ లో రోడ్ షోల‌తో ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ ప్ర‌చారంలో ఆయ‌న మాడ్లాడుతూ, ఆయన కోడికత్తి డ్రామా.ఈయన తాపీకత్తి డ్రామా వేసారు తప్ప చేసింది జీరో అంటూ ఎద్దేవా చేశారు. తాపీక‌త్తి నానీ బందరుని భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని ఫైర్ అయ్యారు. నాని అంటే ఏంటో తెలుసా నాకెంత?నీకెంత? అని అర్ధ‌మ‌ని వివ‌రించారు లోకేష్.. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పనిని ముగ్గురు నానీలకు అప్పగించారు జగన్ రెడ్డి అంటూ ఆ ముగ్గురు లో ఒకరు బూతుల శాఖ మంత్రి …గుడివాడ గెడ్డం గ్యాంగ్ నాని,రెండు అబద్దాల శాఖ మంత్రి బందరు నాని,మూడు అనారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అంటూ చెప్పారు. గుడివాడ నాని సన్న బియ్యం సన్నాసి,బందరు నాని నోరిప్పితే అబద్దం,కనీసం సొంత ఊరిలో ప్రజల ప్రాణాలు కాపాడలేని ఏలూరు ఆళ్ల నాని అంటూ మంత్రుల‌పై సెటైర్ వేశారు.. బందరు నాని మాటలు పీక్…మ్యాటర్ వీక్ అంటూ విమ‌ర్శించారు. క‌రెంటు బిల్లు ఎక్కువొచ్చింద‌య్యా అని నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌లు అడిగితే .క‌ల‌ర్ టీవీ వాడితే క‌రెంటు బిల్లు ఎక్కువొస్తుంద‌ని చెప్పిన మెద‌డు మోకాలులో ఉన్న మంత్రిగా నాని వుండ‌టం మ‌న ఖ‌ర్మ అని అన్నారు లోకేష్. ఈ రెండేళ్ల వైసీపీ హయాంలో బందరులో ఈ ప్రభుత్వం ఈ పని చేసిందని చెప్పగలిగే దమ్ము నానికి ఉందా..? అంటూ ప్ర‌శ్నించారు. అమరావతి లో నీరు,మట్టి,గ్రాఫిక్స్ తప్ప ఏమి లేవంటాడు నాని,.జగన్ రెడ్డి ఏమో అక్కడ 90 శాతం పూర్తయిన భవనాలు చాలా ఉన్నాయి.వాటిని పూర్తి చెయ్యడానికి నిధులు కేటాయిస్తా అంటుర‌ని, ఇంత‌కీ ఇద్దరిలో సన్నాసి కానిది ఎవరో వాళ్లే తేల్చుకోవాల‌ని కోరారు లోకేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement