Friday, April 19, 2024

వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోల‌వ‌రం పూర్తి చేస్తాంః కేంద్రం..

న్యూఢిల్లీ / పోల‌వ‌రం – పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పూర్తవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి కటారియా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పీపీఏ సవరించిన షెడ్యూల్ మేరకు వివరాలు ఇస్తున్నామని తెలిపారు. పోలవరం స్పిల్ వే పనులు మే నాటికి పూర్తవుతాయని మంత్రి కటారియా వెల్లడించారు. ఏప్రిల్ నాటికి క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తవుతుందని స్పష్టం చేశారు. పోలవరం కాఫర్‌ డ్యాం నిర్మాణం జూన్ ‌కల్లా పూర్తవుతుందన్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌, కుడి, ఎడమ కాల్వలు 2022 ఏప్రిల్‌కు పూర్తవుతుందని వెల్లడించారు. భూసేకరణ, పునరావాస పనులు 2022 ఏప్రిల్‌కే అవుతాయని కటారియా వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement