Monday, May 13, 2024

కుటుంబ కలహాలతో అత్మహత్య…

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం కొర్లకుంట శివారు సింహాద్రపురం గ్రామంలో ఒక వ్యక్తి కుటుంబ కలహాలు నేపథ్యంలో మనస్తాపం చెంది అత్మహత్య చేసుకున్నాడు.. గ్రామానికి చెందిన బెజవాడ బాబురావు కూలినాలి చేసుకొని జీవనం చేస్తున్నాడు. ఇటీవల తరచూ అతని భార్య కేశవ తో కుటుంబ కలహాలు కారణం గా గొడవ పడుతున్నారు. మనస్తాపం చెందిన బాబు రావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆపస్మారక ష్థితి ఉన్న బాబురావు నూజివీడు అసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ బాబురావు మృతి చెందారని ముసునూరు పోలీసులు దృవికరించారు. దీనిపై అతని భార్య కేశవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.రాజారెడ్డి పేర్కోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement