Thursday, May 9, 2024

ఓటు హ‌క్కును వినియోగించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్..

విజ‌య‌వాడ – జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబరు 4లో పవన్ ఓటు వేశారు. విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట‌లంక‌లో నివాస‌ముంటున్న ప‌వ‌న్ అక్క‌డే త‌న ఓటును న‌మోదు చేయించుకున్నారు… ఉద‌యాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ప‌వ‌న్ సాధార‌ణ ఓట‌రులా క్యూ లైన్ లో నిలబ‌డి త‌న ఓటును వినియోగించుకున్నారు.. కాగా, ప‌వ‌న్ ఓటు వేసేందుకు వ‌స్తున్నార‌ని తెలిసి పెద్ద సంఖ్య‌లో అభిమానులు అక్క‌డికి చేరుకున్నారు… ఓటు వేసిన అనంత‌రం వారంద‌రికీ అభివాదం చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement