Saturday, May 18, 2024

అంగన్‌వాడీల్లో కొలువుల జాతర షురూ.. రాష్ట్ర వ్యాప్తంగా 5,905 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి, ఆంధ్రప్రభ : అంగన్‌ వాడీ వ్యవస్ధ బలోపేతానికి చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని తీసుకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి సన్నాహాలు మొదలు పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌ వాడీ కొలువుల జాతర మొదలైంది. దేశ వ్యాప్తంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఖాళీలను గుర్తించిన నేపథ్యంలో వాటి భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రాల వారీగా ఖాళీలను భర్తీ చేసే ందుకు ఆయా ప్రభుత్వాలకు అనుమతులు ఇచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కూడా అంగన్‌వాడీ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,905 ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది నాలుగు వేలకు పైగా అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో భారీ రిక్రూట్‌మెంట్‌ కు అనుమతిని ఇస్తూ కార్యాచరణ ప్రారంభించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రస్తుతం భర్తీ చేయనున్న 5,905 పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1468 మెయిన్‌ అంగన్‌వాడీ వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక అలాగే 430 మిని అంగన్‌వాడీ వర్కర్ల నియామకాన్ని చేపట్టనున్నారు. ఇక అంగన్‌వాడీ హెల్ఫర్‌ పోస్టులను భారీగా చేయనున్నారు. మొత్తం 4,007 హెల్ఫర్‌ పోస్టులను మహిళా శిశు సంక్షేమ శాఖ భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి ఐసీడీఎస్‌ అధికార యంత్రాంగం కార్యాచరణను ప్రారంభించింది. నాలుగు జిల్లాల్లో నియామకాలకు చర్యలు తీసుకోంది. మిగిలిన జిల్లాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ ను ప్రాంతాల వారీగా విడుదల చేయనున్నారు.

నాలుగు జిల్లాల్లో మొదలైన నియామకాలు

- Advertisement -

అంగన్‌వాడీ నియామకాల ప్రక్రియ రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైంది. నాలుగు జిల్లాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో నియామక ప్రక్రియ చు రుగ్గా సాగుతోంది. రాష్ట్రంలోని 26 జిల్లా ల్లో ఇటీవలె ప్రాజెక్టులను ప్రభుత్వం పునర్వవ్యస్ధీకరించింది.కొత్త జిల్లాల పరిధిలోకి విలీనమైన ప్రాజెక్టుల ఆధారంగా ఈ నియామక ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కడప , అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నియామక ప్రక్రియ సాగుతోంది. ఈ నాలుగు జిల్లాల్లో 500లకు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే అభ్యర్దులను ఎంపిక చేసి నియామక ఆదేశాలను జారీ చేయనున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు కార్యాచరణను సిద్దం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా పోస్టుల భర్తీ ప్రక్రియ అతి త్వరలో ప్రారంభం కానుంది.

పది పాసైతే చాలు

అంగన్‌వాడీ వర్కర్ల నియామకానికి సంబంధించిన విద్యార్హతల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు.అంగన్‌ వాడీ ఉద్యోగ అర్హతకు కనీసం ఇంటర్మీడియేట్‌ గా కేంద్రం నిర్ణయం తీసుకున్న ప్రస్తుతం దాన్ని అమలు చేయటం లేదు. గతంలో మాదిరిగానే పదోవ తరగతి పాసైతే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్దుల వయసు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. మెయిన్‌ అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 11,500 వేతనం మినీ అంగన్‌వాడీలకు రూ.7,000, హెల్ఫర్లకు రూ. 7,000 గౌరవ వేతనం ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రస్తుతం భ ర్తీ చేయనున్న అంగన్‌ వాడీ వర్కర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఫ్రీ స్కూల్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్నవారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల్లో విద్యా వ్యవస్ధ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రభుత్వం ఫ్రీ స్కూల్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న వారితో బోధన సాగించేందుకు నిర్ణయం తీసుకొంది.

ఎంపిక విధానం ఇలా…

అంగన్‌వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్దుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం వంద మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో పదోవ తరగతి ఉత్తీర్ణులైన వారికి 50 మార్కులు , ఫ్రీ స్కూల్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు , వితంతువులకు 5 మార్కులు , అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్‌ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్‌ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement