Sunday, May 19, 2024

రెండేళ్లలో జగన్ విధ్వంస పాలన: టీడీపీ ఛార్జ్ షీట్

సీఎం జగన్ రెండేళ్ల పాలనపై జగన్ విధ్వంసం పేరుతో టీడీపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఈ సందర్బంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస ముఖ్యమంత్రిగా చరిత్రలో కెక్కారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక జేసీబి, ఏసీబీ, పీసీబీ, టాగ్ లైన్ సిఐడి అని పేర్కొన్నారు. సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలు ఎవరైనా ఒక కార్యక్రమాన్ని మంచి పనితో మొదలు పెడతారు.. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం విధ్వంసంతో మొదలు పెడుతుందన్నారు. జేసీబీతో ప్రజా వేదికను కూల్చడంతో రాష్ట్రంలో జగన్ విధ్వంసం ప్రారంభించారని.. జగన్ పరిపాలన కోసం ఎవరైనా ప్రశ్నిస్తే ఏసీబీ దాడులు చేయిస్తారని ఆరోపించారు. సిఐడి అంటే జగన్ మోహన్ రెడ్డి సంస్థ అని మండిపడ్డారు. సీఎం జగన్ ఏది చెప్తే అది.. సీఐడీ చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నారు. అధికార పార్టీలో ప్రతీ నాయకుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని..జగన్ పాదయాత్ర చేసినపుడు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.

ప్రజలకు నవరత్నాలు కావు ఇవి… నకిలీ రత్నాలు ఇచ్చారని విమర్శించారు. తాము ప్రవేశ పెట్టిన పథకాలకు పేర్లు మార్చడం తప్ప కొత్త పథకాలు అమలు చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలను నిలదీయాలని అచ్చెన్న పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement