Tuesday, May 7, 2024

Karnataka – చిక్‌బళ్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – 13 మంది దుర్మ‌ర‌ణం…

చిక్‌బళ్లాపూర్‌: కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 13 మంది మృతిచెందారు. మ‌ర‌ణించిన వారంతా శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని సమీప పల్లెలకు చెందిన వారిగా గుర్తించారు. పండుగ కోసం ఊరికి వచ్చి తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా జ‌రిగిన ఈ ప్రమాదం లో మృతి చెందిన వారంతా బెంగళూరులో కూలి పనులకు వెళ్లే కూలీలు,సాఫ్ట్ వేర్ ఉద్యోగులని పోలీసులు చెబుతున్న‌నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement