Monday, April 29, 2024

వైసిపి చేతికి పులివెందుల‌,రాయ‌చోటి, య‌ర్ర‌గుంట్ల మునిసిపాలిటీలు….

కడప బ్యూరో : కడప జిల్లాలో నామినేషన్లు ముగిసే సమయానికి 3 మున్సిపల్‌ చౖౖెర్మన్‌ స్థానాలను వైసీపీ హస్తగతం చేసుకుంది. సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల, చీప్‌ వి ప్‌ శ్రీకాంత్‌ రెడ్డి నియోజవర్గం రాయచోటి, యర్రగుంట్ల మున్సిపాలిటీ చైర్మన్‌ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే కడప నగర పాలకసంస్థ మేయర్‌ పీఠాన్ని అధిరోహించేందుకు వైసీపీ అత్యంత చేరువలోకి చేరింది. నగరంలో 50 డివిజన్లు ఉండగా బుధవారం నాటికి 23 డివిజన్లను ఏకగ్రీవం చేసుకొని అధికారపీఠం పై కూర్చునేందుకు సిద్దమైంది. మరో నాలుగు డివిజన్లను గెలిస్తే మేయర్‌ పీఠం సునాయాసంగా కైవసం చేసుకోవచ్చు. ఇకపోతే జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు లలో వైసీపీ, టీడీపీ, బీజెపీ మధ్య పోటాపోటీగా ఈనెల 10న ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్లకు బుధవారం చివరి గడువు కావడంతో వైసీపీ నాయకులు పలు చోట్ల చక్రం తిప్పి నామినేషన్ల ను విత్‌ డ్రా చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement