Thursday, April 25, 2024

వాలంటీర్ల సేవలు ప్రశంసనీయం – జిల్లా ఎస్పీ

మైదుకూరు, : వాలంటీర్ల సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు వాలంటీర్ ల సేవలు అభినందిస్తూ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ప్రదాన కార్యక్రమం లో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి,జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్, జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ మాట్లాడుతూ వాలంటీర్ ల సేవలు అభినందనీయమని, సేవలను గుర్తించి అవార్డులతో సత్కరించే మంచి కార్యక్రమం లో పాల్గొనడం ఆనందం గా ఉందన్నారు. వాలంటీర్ ల సేవలు గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పురస్కారాల కార్యక్రమంలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు అందజేయడం, అందులో జిల్లా పోలీసు శాఖ భాగస్వామ్యం కావడం సంతోషకరమన్నారు. కోవిడ్, నివర్ తుఫాను, ఇతర అత్యవసర పరిస్థితుల్లో వాలంటీర్లు జిల్లా ప్రజలకు నిరుపమానమైన సేవలు అందించారన్నారు. అనంతరం జేసి గౌతమి మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి గా పనిచేస్తున్న వాలంటీర్ల ని సన్మానించడం ఆనందకరమన్నారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల ను ప్రభుత్వానికి చేరవేస్తూ, ప్రభుత్వ పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందించడంలో వాలంటీర్ల సేవలు అభినందనీయమన్నారు. కరోనా కష్ట కాలంలో, నివర్ తుఫాను సమయంలో వారి సేవలు ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. అనంతరం అవార్డు లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి బ్యాంకు చైర్మన్ తిరుపాల్ రెడ్డి, మైదుకూరు మునిసిపల్ చైర్మన్ మాచానూరు చంద్ర, మైదుకూరు నియోజకవర్గ వాలంటరీలు, అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement