Sunday, April 28, 2024

ఘోర రోడ్డు ప్రమాదం… ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం…

కడప జిల్లా మంగంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెంద‌గా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఓబులవారిపల్లె మండలం అయ్యలరాసపల్లికి చెందిన వారుగా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో అయ్యలరాసపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆటో మంగంపేట అగ్రహారం దాటగానే ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఒక్కసారిగా ఢీకొట్టింది. దాంతో తులశమ్మ, సాయిశ్రీ, మూడు నెలల చిన్నారి కౌశిక్ రెడ్డి, ఆకుల పెద్ద వెంకటసుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. అయ్యలరాసపల్లెకు చెందిన ఆటోడ్రైవర్ బాలకృష్ణ, పెంచలమ్మ తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కాగా, దవాఖానలో చికిత్స పొందుతూ పెంచలమ్మ తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ఆటో డ్రైవర్ బాలకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. భార్య, ఇద్దరు పిల్లలు, అత్తను పోగొట్టుకుని రోదిస్తున్న కృష్ణారెడ్డి గుండెలవిసేలా రోధిస్తున్నాడు. మంగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement