Tuesday, March 26, 2024

ఆన్ లైన్ గేమ్ కు యువ‌కుడి బ‌లి

ఆన్ లైన్ గేమ్ మ‌రొక‌రిని బ‌లితీసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌కాశం జిల్లాలో ఆన్ లైన్ గేమ్ మ‌రొక‌రి ప్రాణం తీసింది. జిల్లాలోని క‌నిగిరి మండలం శంఖ‌వ‌రంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆన్ లైన్ గేమింగ్ సంస్థ వేధింపుల‌కు యువ‌కుడు చ‌నిపోయాడు. చెన్న‌కృష్ణ అనే యువ‌కుడు ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. సంస్థ‌కు ఆ యువ‌కుడు రూ.2ల‌క్ష‌లు బ‌కాయి ప‌డ్డాడు. ఇప్ప‌టికే చెన్న‌కృష్ణ రూ.1.60ల‌క్ష‌లు చెల్లించ‌గా, మ‌రో రూ.40వేల కోసం ఆన్ లైన్ గేమ్ సంస్థ యువ‌కుడిని వేధించ‌డంతో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement