Thursday, May 2, 2024

దంపతుల దారుణ హత్య..

కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠం మండలం కొత్త బసాపురం దంపతుల హత్య కలకలం రేపుతోంది. తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న వారిపై వీరయ్య అనే వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. అయితే…ఈ ఘటన లో మృతి చెందిన వారికి నిందితుడు వీర‌య్య కొడుకు వరుస అవుతాడని తెలుస్తోంది. మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేక పెద్దమ్మ నాగ‌మ్మ, పెద్దనాన్న నాగ‌య్య ల‌ను హ‌త్య చేసిన‌ట్లు స్థానికులు అంటున్నారు. అయితే.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితున్న అరెస్ట్‌ చేశారు. ఈ హత్య జరగడానికి గల కారణాల పై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో నైట్ పూట కర్ఫ్యూ కొనసాగింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement