Saturday, May 11, 2024

జమ్మలమడుగులో భారత్ బంద్ విజయవంతం

జమ్మలమడుగు అర్బన్ – కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ శుక్రవారం జమ్మలమడుగు విద్యార్థి సంఘాలు అయినా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారత్ బంద్ విజయవంతమైనట్లు విద్యార్థి సంఘాల నాయకులు శివ కుమార్ మరియు వినయ్ కుమార్ లు తెలిపారు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టి విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయడం జరిగినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ దేశంలో రైతులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాడని విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ చేస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు రు అలాగే కడప ఉక్కు ను త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నిటినీ విరమించుకొ నే వరకు పోరాటాలు ఆగవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ ఇ నాయకులుఎల్లయ్య సురేష్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement