Tuesday, April 30, 2024

ఆర్‌ఓబి పనులు..

దేవరకద్ర : మండల కేంద్రంలో జరుగుతున్న ఆర్‌ఓబి పనులు మరింత వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని టిఎస్‌ రాష్ట్ర క్వాలిటీ చీఫ్‌ ఇంజనీయర్‌ సతీష్‌ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో జరుగుతున్న ఆర్‌బి పనులను ఆయన పరిశీలించారు. పనుల విషయంలో ఎవ్వరూ కూడా నిర్లోం చేయరాదని ఆయన కోరారు. ఆర్‌ఓబి పనులు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సర్వీస్‌ రోడ్లను బిటీ రోడ్డుగా ఎందుకు మార్చలేదని అధికారులను ఆయన ప్రశ్నించారు. వెంటనే బిటి రోడ్డు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పనుల విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పనుల విషయంలో క్వాలిటీ తగ్గరాదని ఒకవేళ అలా చేస్తే అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అధికారుల వెంట ఎస్‌ఈ పుల్లారెడ్డి, ఈ ఈ రామేశ్వర్‌ రెడ్డి, జిల్లా అధికారులు , కాంట్రాక్టర్‌ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement