Tuesday, April 30, 2024

Joining – చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలు ఉండ‌వ‌ల్లి, మేక‌పాటి

మంగళగిరి: వైసిపి ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి (ఉదయగిరి) టిడిపిలో చేరారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారు సైకిల్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే స‌మయంలో చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా తెలుగుదేశంలో చేరారు.

జగన్‌ అపరిచితుడు.. చెప్పింది ఒక్కటీ చేయరు: చంద్రబాబు
చేరిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ, వచ్చే ఏడాది జనవరిలో సైకిల్ వేగం మరింత పెరుగుతుందని అన్నారు. . ‘‘రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వైకాపాలో ప్రకంపనలు మొదలయ్యాయి. జగన్‌.. అన్ని సంప్రదాయాలను నాశనం చేశారు. అధికారంలోకి వచ్చాక జగన్‌ ఎప్పుడైనా ప్రజలతో మాట్లాడారా?ఆయన ఒక అపరిచితుడు.. చెప్పింది ఒక్కటీ చేయరు. తల్లి, చెల్లికి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వరు. జగన్‌.. రాష్ట్రంలో అరాచక సైన్యాన్ని వదిలిపెట్టారు. వైకాపా నావకు చిల్లు పడింది.. బయటపడే పరిస్థితి లేదు’’ అని తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement