Sunday, May 5, 2024

Joining – జ‌న‌సేన‌లో చేరిన మండ‌లి బుద్ధ ప్రసాద్ , నిమ్మ‌క జ‌య‌కృష్ణ

పిఠాపురం – మాజీ ఉపసభాపతి, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్, పాలకొండ నియోజక వర్గానికి చెందిన నిమ్మక జయకృష్ణ లు నేడు జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలోని జ‌న‌సేన కార్యాల‌యంలో నేడు వారిద్దరిని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఉపసభాపతి మాట్లాడుతూ.. అవనిగడ్డలో తనను నిలబడాలని పవన్ కోరారని తెలిపారు. చంద్రబాబు కూడా దీనికి మద్దతు ఇచ్చారన్నారు. తనకు టికెట్ ఖాయం అయిందని.. ఈరోజు అధికారికంగా తన పేరు ప్రకటిస్తారని వెల్లడించారు. ఐదేళ్లుగా ఏపీలో జరగని అరాచకం లేదని అన్నారు. వేలకోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. తెలుగు భాష అభివృద్ధికు తాము చేసిన కృషిని ఎన్నోసార్లు మెచ్చుకున్నారని తెలిపారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని మండలి బుద్ధప్రసాద్ భావించారు. అయితే టీడీపీ – బీజేపీ పొత్తులో భాగంగా అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించారు. దీంతో మండలి బుద్ధ ప్రసాద్ టీడీపీకి గుడ్‌బై చెప్పేసి జనసేన పార్టీలో చేరారు. అలాగే పాల‌కొండ‌లోనూ జ‌న‌సేన పోటీ చేయ‌నున్న‌ది.. అయితే అక్క‌డ కూడా అభ్య‌ర్ధుల కొర‌త ఉండ‌టంతో టిడిపి నేత నిమ్మ‌ల జ‌యకృష్ణ‌ను నేడు జ‌న‌సేన‌లో చేర్చుకున్నారు.. జ‌య‌కృష్ణ పాల‌కొండ నుంచి జ‌న‌సేన అభ్య‌ర్ధిగా పోటీ చేయ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement