Thursday, May 2, 2024

తాడి‌ప‌త్రి వార్డు స‌భ్యుడిగా జెసి ప్ర‌భాక‌ర‌రెడ్డి పోటీ…

అనంత‌పురం – అనంత జిల్లాలో గట్టి ప‌ట్టు ఉన్న నేత‌ల‌లో జెసి ప్ర‌భాక‌ర‌రెడ్డి ఒక‌రు.. టిడిపి పార్టీకి ఆయ‌న‌తో పాటు జెపి దివాక‌ర‌రెడ్డి అండ‌గా ఉంటున్నారు..సీనియ‌ర్ నేత‌గా ఉన్న ప్ర‌భాక‌ర‌రెడ్డి ఇప్పుడు వార్డు స‌భ్యుడిగా పోటీకి దిగుతున్నారు. తాడిప‌త్రి మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌లో వార్డు మెంబ‌ర్ గా పోటీ చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.. తాడిప‌త్రిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లపాటు తనకు ఇంకే పదవి వద్దని స్పష్టం చేశారు. ఐదేళ్లలో ఐదుగురు చైర్మన్లు అవుతారు, ఐదుగురు వైస్ చైర్మన్లు అవుతారు… నేను మాత్రం కౌన్సిలర్ గానే ఉంటా అని వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మున్సిపల్ సమావేశాల్లో ఎన్నడూ వేదిక ఎక్కలేదని, ఇప్పుడు కూడా తాను వేదిక కిందే కౌన్సిల్ లో ఓ సభ్యుడిగా ఉంటానని అన్నారు. తనకు 68 ఏళ్లని, తనకు ఏ కోరికలు లేవని జేసీ చెప్పారు. ప్రజాసేవే తనకు ముఖ్యమని, ఇంతకుముందు కూడా చేసి చూపించానని ఉద్ఘాటించారు. ప్రజలు తనవైపే ఉన్నారని, పురపాలక ఎన్నికల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement