Monday, May 6, 2024

టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి అధర్మ పాలన

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై జనసేన నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దశాబ్దాల కాలంగా ఉన్న ఏ పాలకమండలి చేయని, దోపిడిని సుబ్బారెడ్డి హయంలో జరుగుతున్నాయని ఆరోపించారు. చైర్మన్ సుబ్బారెడ్డి పాలనలో పూర్తి అధర్మంగా కొనసాగుతుందని జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. దోచుకోవడమే ధ్యేయంగా వైసిపి ఆశీస్సులతో శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని దుయ్యంబట్టారు. ఉదయాస్తమాన సేవల దర్శనాన్ని ప్రవేశపెట్టి…. వాటిని బోర్డు మెంబర్లు పంచుకుంటూ కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకోవడం బాధాకరమన్నారు. కొత్త సినిమా టికెట్ల కోసం కొట్టుకున్నట్లు … టీటీడీ పాలక మండలి సభ్యులు ఈ టికెట్ల దందాలో కీచులాడుకుంటున్నారని చెప్పారు. బోర్డు మెంబర్ల అవినీతి బాగోతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందన్నారు. దీనిపై భక్తులకు వివరణ ఇవ్వాలని జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement