Friday, May 3, 2024

Jana Sena – ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ , నాదెండ్ల సమీక్ష‌…

మంగ‌ళ‌గిరి – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ నిర్వహణ, జనసేన – తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లు సుదీర్ఘంగా చర్చించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఈ భేటీ జరిగింది.

రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణా పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశం చర్చకు వచ్చింది. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జన సైనికులు, వీర మహిళలపై అక్రమంగా పెడుతున్న కేసులు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని జ‌న‌సేనాని భావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement