Wednesday, May 15, 2024

Jai Bharath Pary – ఎపిలో అన్ని స్థానాల‌కు పోటీ…జెడి ల‌క్ష్మీనారాయ‌ణ‌…

విశాఖ‌ప‌ట్నం – వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని లక్ష్మీనారాయణ ప్రకటించారు. విశాఖ‌లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, 25 లోక్ స‌భ‌, 175 అసెంబ్లీ స్థానాల‌లో అభ్య‌ర్ధుల‌ను దింపుతామ‌ని చెప్పారు..
తమ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేస్తాం టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నారని తెలిపారు.  స‌చ్చిలురైన వారినే బ‌రిలో నిల‌బెడ‌తామ‌న్నారు.. మరో మూడ్రోజుల్లో తమ పార్టీ మేనిఫెస్టో విడుద‌ల చేస్తామ‌న్నారు.. అభివృద్ధే ప్రధానంగా ఉపాధి, రైతుల సంక్షేమం కోణంలో తమ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement