Monday, April 29, 2024

AP: తండ్రిని మించిన తనయుడిగా జగన్‌ పాలన… సజ్జల

తండ్రిని మించిన తనయుడిగా సీఎం జగన్‌ పాలన అందిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత జగన్‌దేనన్నారు. ఇచ్చిన హమీలను నెరవేర్చి.. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. పూర్తి పారదర్శకంగా సంక్షేమం పథకాలు అందించిన ఘనత జగన్‌దేనన్నారు. అవినీతికి తావులేకుండా, అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామని సజ్జల పేర్కొన్నారు. పేదల చేయి పట్టుకుని నడిపిస్తున్నారన్నారు.

ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆస్పత్రులు ఇలా అన్నీ అందుబాటులోకి తెచ్చారన్నారు. అన్నీ కళ్లముందే కనిపిస్తున్నాయన్నారు చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు. జగన్ పాలన పారదర్శకంగా జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల కోసం మారీచ శక్తులు మళ్లీ ఏకం అయ్యాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement