Wednesday, May 1, 2024

రేపటి నుంచే జగనన్నే మా భవిష్యత్.. సజ్జల

రేపటి నుంచే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేపటి నుంచి ఈనెల 20వతేదీ వరకు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఉంటుందని సజ్జల తెలిపారు. ఈ నినాదం ప్రజల్లోంచి వచ్చిందేనన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తమ ప్రతినిధులు వెళ్తారన్నారు. కోటి 20లక్షల ఇళ్లకు గృహ సారథులు వెళ్తారన్నారు. 7లక్షల మంది గృహ సారథులు ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తారన్నారు. గత పాలనకు, తమ పాలనకు ఉన్న తేడాను అడుగుతారన్నారు. ఇలాంటి సాహసం గతంలో ఎవరూ చేయలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement