Wednesday, May 8, 2024

జగనన్న విద్యా దీవెన.. నిధులు మంజూరు

విజయనగరం : కళాశాలల్లో చదువుతున్న అర్హత ఉన్న ప్ర‌తి విద్యార్థికి పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించే జగనన్న విద్యా దీవెన. ఈ పధకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుండి బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయగా విజయనగరం నుండి జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, డీసీఎంఎస్ చైర్పర్సన్ డా.అవనాపు భావన పాల్గొని వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిడి రత్నం, మైనారిటీ సంక్షేమ అధికారి లావణ్య, విద్యార్థులు, తల్లులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement