Friday, May 3, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పొయిన.. బుల్లితెర న‌టి

రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పొయింది ప్ర‌ముఖ టీవీ న‌టి వైభ‌వి ఉపాధ్యాయ‌. కారు ప్ర‌మాదంలో ఆమె మృతిచెందారు. త‌న భాయ్‌ఫ్రెండ్‌తో ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. ఫేమ‌స్ టీవీ షో సారాభాయ్ వ‌ర్సెస్ సారాభాయ్‌లో జాస్మిన్ పాత్ర‌ను పోషించింది. ఆ పాత్ర చాలా పాపుల‌ర్‌. షో ప్రొడ్యూస‌ర్ జేడీ మ‌జీతియా .. న‌టి వైభ‌వి మృతిని క‌న్ఫ‌ర్మ్ చేశారు. వైభ‌వి ఉపాధ్యాయ వ‌య‌సు 32 ఏళ్లు. ఆమె పార్ధీవ దేహాన్ని ముంబైకి తీసుకురానున్నారు. 24వ తేదీన అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. వైభ‌వికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. భాయ్‌ఫ్రెండ్‌తో వెళ్తున్న ఆమె కారు హిమాచ‌ల్ లోయ‌లో ప‌డింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement