Saturday, April 27, 2024

సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్లే జ‌గ‌న్ కు జ‌నం నీరాజ‌నం : మంత్రి అనిల్

జగన్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల వ‌ల్లే జ‌నం ఆయ‌న‌కు నీరాజనం ప‌లుకుతున్నార‌ని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ పేర్కొన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… విపక్షాలపై తీవ్ర‌ విమర్శలు చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఓటీఎస్‌ వరంలాంటిదని ఆయన అభివర్ణించారు. ఏకకాలంలో ఇంటిపై పూర్తి హక్కును పొందేలా జగన్‌ తీసుకువచ్చిన ఓటీఎస్‌పై ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఏంచేయలేరని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్రంలో విపక్షాలు సిద్ధాంతాలను పక్కన పెట్టి ఏకమై రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అయితే సీఎం జగన్‌కు ప్రజలు అండగా నిలబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement