Wednesday, May 15, 2024

రూ.వేల కోట్ల‌తో భావ‌న‌పాడు షిప్పింగ్ హార్బ‌ర్ – 19న జ‌గ‌న్ భూమి పూజ‌

శ్రీకాకుళం,ప్రభన్యూస్‌బ్యూరో: శ్రీకాకుళం జిల్లా ప్రజలు, మత్స్యకారులు దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భావనపాడు షిప్పింగ్‌ హార్బ ర్‌ ఎట్టకేలకు నిర్మాణానికి నోచుకోబోతోంది. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడు వద్ద షిప్పింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి పలుమార్లు ఆ ప్రాంతంలో వివిధ కంపెనీలు పరిశీలన చేశాయి. 1996లో అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూడా భావనపాడు హార్బర్‌ నిర్మాణానికి జర్మన్‌ కంపెనీతో పరిశీలన చేయించింది. అయితే షిప్పింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ఆప్రాంతం అనువుగా లేదని, అప్పట్లో చెప్ప డంతో తరువాత కొంత కాలం అది మరుగున పడింది. వైఎస్‌ రాజశేఖరెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా దీనిపై చర్చలు జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో భావనపాడు హార్బర్‌ నిర్మాణం అనేది ఎన్నికల హామీగా మాత్రమే మిగిలి పోయిందనే విమర్శలు ప్రజలనుంచి వినిపించాయి. 2014లో చంద్రబాబునా యుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లిd దీని నిర్మాణానికి నడుం బిగించడం జరిగింది. అప్పట్లో తొలుత 6 వేల ఎకరాలలో నిర్మించాలని నిర్ణయించి నప్పటికీ, తరువాత పలుమార్లు పరిశీలనలు, మ్యాప్‌లు తయారు చేసిన తరువాత 2,200 ఎకరాలలో నిర్మించేశలా అదానీ కంపెనీకే అప్పగించాలని కూడా నిర్ణయిం చారు. దీనిపై అప్పట్లో మర్రిపాడు, భావనపాడు, సీతానగరం, శెలగపేట గ్రామా ల్లో భూసేకరణ కూడా చేపట్టారు. అయితే నిర్మాణ పనులు మాత్రం ప్రారం భించలే దు. 2019 ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోవడం, వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది.

కరోనా కారణంగా తొలి మూడు సంవత్సరాలు దీనిపై వైసీపీ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. అయితే తరువాత ఈ హార్బర్‌ నిర్మాణాన్ని భావనపాడుకు బదులు అదే మండలంలోని విష్ణుచక్రపురం, రాజపు రం, మూలపేట గ్రామాలలో భూసేకరణ చేసి నిర్మించడానికి, ఇందుకోసం గతంలో చెప్పిన విధంగా 2,200 ఎకరాలు కాకుండా కేవలం 650 ఎకరాలలోనే దీనిని నిర్మిం చడానికి నిర్ణయిం చారు. దాదాపు 3 వేల కోట్ల రూపాయలతో దీనిని నిర్మించేందుకు అదానీ కంపెనీకి దీనిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే ఆ మేరకు భూసేక రణ పూర్తిచేసి, రైతులకు ఎకరానికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించే చర్యలు కూడా పూర్తిచేసింది. దీంతో భావనపాడు షిపింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి అన్ని అండం కులు దాదాపు తొలగిపోవడంతో ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చేతులమీదుగా శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. నిర్వాసితులకు మూలపేట వద్ద పునరావాస కాలనీ నిర్మించేందుకు కూడా చర్యలు చేపట్టారు. దీంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు, మత్స్యకారులు మూడున్నర దశాబ్దాలుగా కలలు కంటున్న హార్బర్‌ చివరకు నిర్మాణానికి నోచుకుంటోంది. దీనిద్వారా జిల్లాలో పలు పరిశ్ర మలకు సంబందించిన ఎగుమతులు, దిగుమతులు సులభతరమవడమే కాకుం డా, మత్స్యసంపదను ఇతర ప్రాంతాలకు పంపించుకునేందుకు వీలుంటుంది. ఈ ప్రాంతం నుంచి మత్స్యకారులు గుజరాత్‌, చెన్నై వంటి ప్రాంతాలకు వలస వెళ్లకు ండా ఈ ప్రాంతంలోనే చేపలవేట చేసుకుని, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసు కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం వాణిజ్యపరంగా బాగా అభి వృధ్ధి చెందితే జిల్లాకు ఆదాయం కూ డా భారీగా సమకూరుతుందని, వందలాది మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ తాయని అధికారులు తెలియచేస్తున్నారు. ఎన్నికల సంవత్సరంలో దీని శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనతోనే ఆగిపోకుండా దీనిని నిర్మాణ పనులు త్వరి తగతిన జరిగేలా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాగం కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement