Monday, April 29, 2024

AP: జగన్ ఇంటికి వెళ్ళడానికి సిద్ధం.. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య

కడప బ్యూరో – ప్రభ న్యూస్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధం అంటున్నాడు.. దేనికి సిద్దమంటే.. నేను ఇంటికి వెళ్ళడానికి సిద్దమని ఆయనే చెబుతున్నాడు. ప్రజలు కూడా ఆయనను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ సి..రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. సోమవారం కడప పట్టణంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సామాన్యుల జీవితాలను దుర్భరం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ఇన్ని వైఫల్యాలు ఉన్నా జగన్ ప్రజల్లోకి రావడం హ్యాట్సాఫ్. జగన్ కు ఎందుకు ఓట్లు వేయాలి. వైఫల్యాల కారణంగా జగన్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు.


వాస్తవానికి జగన్ తో పొత్తు పెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. జగన్ తో పొత్తు అంటే భయపడిపోతున్నారు. రాష్ట్రంలో మీడియాపై దాడులకు తెగబడుతున్నారు. ఇబ్బంది పడ్డ వారిపైనే కేసులు నమోదు చేసే పరిస్థితి నెలకొంది. అవినీతిలో పుట్టిన పార్టీ వైసీపీ అన్నారు. ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనేది భ్రమలు మాత్రమేనని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సాదించుకోవాల్సిన అవసరం ఉంది.. వాటి సాధన కోసమే టిడిపి- బిజెపి- జనసేన పొత్తులు అన్నారు. జగన్.. నేను సింహం అంటున్నావు.. ఎవరికి మీ చెల్లెలికా ?.. సింహాలు అడవుల్లో ఉండాలి ప్రజల్లో కాదు.. తప్పు ఎత్తి చూపించే వారిని పక్కన పెట్టి భజనపరులను దగ్గర పెట్టుకోడం జగన్ కు అలవాటుగా మారిందన్నారు. దీని ఫలితం జగన్ అనుభవించక తప్పదు.. రాష్ట్ర ప్రజలు 22మంది ఎంపీలు ఇస్తే దేనికి ఉపయోగం.. ఎవరు లాభపడ్డారు ?.. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చారా…సామాన్యులకు ఒరిగిందేమి లేదన్నారు.


అగ్రకులాలను ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు. ఎస్సీల బలహీనతలను స్వప్రయోజనాలకు వాడుకొంటున్నారని ఆయన ఆరోపించారు. నీ అవినీతి పాలనను సహించే పరిస్థితిలో నీ కుటుంబసభ్యులు లేరు. ఇంక ప్రజలు ఎలా వింటారు. నీవు ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజలు ఉపేక్షించారు. ప్రతి రోజు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తీస్తున్నారు. మీకు డబ్బులు బలం తప్ప ప్రజా బలం లేదు. ప్రజలు జగన్ ను భరించలేకపోతున్నారు. తప్పకుండా ఇంటికి పంపిస్తారని రామచంద్రయ్య చెప్పారు.

- Advertisement -


వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. ఓటమి పాలవుతానని తెలిసి కూడా భయపెడుతున్నావు. కమలాపురంలో పోలీస్ ల కళ్ళ ముందే అరాచకం. టీడీపీ నేతలపై దాడులకి తెగబడ్డారు. వీటిని పోలీసులు ప్రోత్సహిస్తే అడ్డుకుంటామని తెలిపారు. బస్సు లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే.. వేల బస్సులు సిద్ధం సభలకా ? అంటూ ఆయన ప్రశ్నించారు. సిద్ధం సభలకు ప్రజలు స్వచ్చందంగా రావడం లేదు. సీఎం పర్యటనకు ప్రజలను తరలిస్తున్నారు. ఎంత కట్టడి చేసినా సభల నుంచి బయటకు వస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్టంలో ఏమి సాధించావు. స్వంత డబ్బా పచ్చి అబద్దాలు చెప్పుకునేందుకే జగన్ కు సమయం సరిపోతుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రామచంద్రయ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement