Monday, April 29, 2024

జగనన్నే మా భవిష్యత్తు పేరుతో ప్రతి గడపకూ వైసిపి ప్రచారం

తాడేప‌ల్లి: జగనన్నే మా భవిష్యత్తు పేరుతో ప్రతి గడపకూ ప్రచారం చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ముఖ్య‌మ‌త్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు. మార్చి 18 నుంచి 26 వరకూ కూడా జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ నిర్వ‌హించాల‌న్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ దిశానిర్దేశం చేశారు . గడప, గడపకూ వైయస్ఆర్‌సీపీ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు వెళ్లాల‌న్నారు. 5.65 లక్షల మంది సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో కూడిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సైన్యం సిద్ధ‌మైంద‌ని చెప్పారు. వీరు 1.65 కోట్ల గృహాలు సంద‌ర్శించాల‌న్నారు . గడపగడపకూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం అత్యంత కీలకమ‌ని గుర్తు చేశారు. నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాల‌ని ఆదేశించారు. . అలాగే రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement