Thursday, May 2, 2024

AP: జ‌గ‌న్ 420…స‌జ్జ‌ల 840 – నారా లోకేష్

రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు టిడిపి జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ . జగన్ ఓ 420 అలానే సజ్జల 840 అని అని మండిపడ్డారు. ఇక 420 జగన్ కి 840 సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడని.. కాని ఒక్కటి పనికొచ్చే సలహా ఇవ్వరని ఎద్దేవ చేశారు.

విజయనగరం జిల్లా రాజాంలో శంఖారావం బహిరంగ సభలో ఆయ‌న మాట్లాడుతూ, ఇక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సలహా మేరకు వైసీపీ దొంగ ఓట్లతో గెలిచేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెలేల్సి ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలను టీడీపీ గెలిచిందని.. ఆ సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి అసలు వీళ్ళు మా ఓటర్లే కాదన్నారని.. అయితే ఆ సమయంలో ఆయనలా ఎందుకన్నారో అప్పుడు అర్ధం కాలేదు కానీ ఇప్పుడు అర్ధమవుతుందని.. దొంగ ఓట్లు ఎక్కించి రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దొంగ ఓట్ల దొంగ‌లంద‌రూ జైలుకెళ్ల‌డం ఖాయం
తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమని లోకేశ్ అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని.. రేపోమాపో విచారణ నివేదిక వస్తుందని అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్తారని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. అధికారులు నీతి, నిజాయతీతో పని చేయాలని చెప్పారు. తన రెడ్ బుక్ లో ఎక్కాలని అధికారులు ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు.

- Advertisement -

నాకు క్లాస్ మేట్స్ ….జ‌గ‌న్ కు జైల్ మేట్స్…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక కటింగ్ మాస్టర్ అని విమర్శించారు తనకు క్లాస్ మేట్స్ ఉంటే… జగన్ కు జైల్ మేట్స్ ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే చెత్త కేబినెట్ అని జగన్ కేబినెట్ కు అవార్డు వచ్చిందని అన్నారు. ఏపీ మంత్రులను అర్ధరాత్రి లేపి అడిగితే వారి శాఖలు ఏమిటో కూడా వారు చెప్పలేరని సెటైర్ వేశారు. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ అనుకుంటోందని అన్నారు. ఉత్తరాంధ్ర ఒక పోరాటాల గడ్డ అని ఎన్ని కేసులు పెట్టినా భయపడని కార్యకర్తలకు వందనం చేస్తున్నానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement