Saturday, April 27, 2024

జ‌న‌సేన‌ను చంద్ర‌సేనగా మారిస్తే పర్‌ఫెక్ట్‌.. మంత్రి అమ‌ర్నాథ్

జనసేన పార్టీ పేరు చంద్రసేనగా మారిస్తే పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జనసేన ఆధ్వర్యంలో నిన్న శ్రీకాకుళం రణస్థలంలో ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు తమ కుటుంబం గురించి మాట్లాడటానికి పవన్ కళ్యాణ్‌కు సిగ్గుందా ? అని ఆయన మండిపడ్డారు. తమది పవన్‌లా ప్యాకేజీలకు తాళాలు కొట్టే కుటుంబం కాదు అని ఆయన వ్యాఖ్యానించారు.

తిట్టడానికి సభ పెట్టలేదంటూనే సీఎం జగన్‌ నుంచి మొదలు అందరినీ సభలో తిట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. చేతికి అందే దూరంలో ఉంటే సీఎంను కొడతానని అన్నారని, చెప్పుతో కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు అమర్నాథ్. తమకూ చేతులు, చెప్పులు ఉన్నాయన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని అమర్నాథ్ సూచించారు. ప్రజలపై పవన్‌కు నమ్మకం లేదని, అందుకనే ఒంటరిగా కాకుండా పొత్తులతో ముందుకెళ్తామని పవన్ స్పష్టం చేశారని విమర్శించారు. తమకంటే పోరాడేవారు ఎవరూ లేరన్న పవన్ చివరికి ఒంటరిగా పోటీచేస్తే వీరమరణం తప్పదని, తానొక ప్యాకేజీ స్టార్‌నని చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement