Tuesday, April 30, 2024

వరసిద్ధి వినాయకుని అనుగ్రహంతో ఏపీలో పెట్టుబ‌డులు.. స్వరూపానందేంద్ర స్వామి

యావత్ భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు రాని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వచ్చాయంటే అది కాణిపాకం వరసిద్ధి వినాయకుని అనుగ్రహమేనని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. కాణిపాకంలో మూడు రోజులపాటు నిర్వహించిన లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనం పూర్ణాహుతిలో స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ లక్ష మోదక హవనం ఫలితం సిద్ధించిందని చెప్పడానికి ఏపీకి వచ్చిన 13లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే నిదర్శనమని తెలిపారు. యజ్ఞ యాగాదుల ఫలితాలను ప్రశ్నించే హేతువాదుల మనోభావాలు దెబ్బతినేలా లక్ష మోదక హవనం ఫలించిందని చెప్పారు. ఇటువంటి వైదిక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా రాష్ట్రం మరింత పురోభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రారంభం నుంచి పూర్ణాహుతి వరకు కాణిపాకంలోనే ఉండి లక్ష మోదక హవనాన్ని పర్యవేక్షించడం ఆనందంగా ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement