Friday, May 3, 2024

ముధక్ పల్లిలో రైతు ఆత్మహత్య..

నిజామాబాద్ రూరల్, మార్చి 5 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా మోపాల మండలంలోని ముధక్ పల్లి గ్రామానికి చెందిన కందురి నర్సయ్య (48) అనే రైతు తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆయన మానసిక పరిస్థితి బాగా లేనందున ఎన్నిసార్లు ఆస్ప‌త్రుల‌ చుట్టు తిరిగినా నయం కాలేదని, తమ పొలం వాగు గట్టుకు గల చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement