Friday, May 3, 2024

అమ‌రావ‌తిలో 50వేల మంది పేద‌లకు ఇళ్ల ప‌ట్టాలు రెడీ…

అమరావతి, ఆంధ్రప్రభ: రాజధాని అమరా వతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 21 లేఅవుట్లలో 50వేల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలు అందించే ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి.. అటవీ అనుమతులతో పాటు ఆర్‌-5,ఎస్‌3 జోన్‌లలో 1402.58 ఎకరాల విస్తీర్ణంలో 50,004 మందికి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. త్వరలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదిలాఉండగా, నేలపాడులో హైకోర్టు అదనపు భవనాలు కూడా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి.. మొత్తం 14 కోర్టు హాళ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని అధికారు లు ముఖ్యమంత్రికి వివరించారు. సుమారు 76,300 చదరపుఅడుగుల విస్తీర్ణంలో అదనపు హైకోర్టు భవనం రూపుదిద్దుకుంటోంది. రాష్ట్రం లో టిడ్కో ఇళ్ల నిర్మాణం.. లబ్దిదారులకు పంపిణీ ని వేగవంతం చేశామని తెలిపారు. గురువారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ పురపాలక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. సీఐటీఐఐఎస్‌ (సిటీస్‌) కార్యక్రమం కింద 12 అర్బన్‌ ప్రాంతాల్లో పనులు చేపట్టామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన పేదల సొంతింటి కల త్వరలో సాకారం కావాలని ఆకాంక్షించారు. ఇళ్లు లేని వారికి ఉచితంగా అమరావతిలో ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తున్నామని నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద ఉచితంగా ఇళ్లపట్టాలు ఇస్తామన్నారు. ఇది ఇళ్లు లేని నిరుపేదల చిరకాల వాంఛ నెరవేర్చే బృహత్త కార్యక్రమంగా అభివర్ణించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటు-న్న చర్యలను అధికారులు వివరించారు. రాజధానిలో 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలకు మొత్తం 21 లే అవుట్లు సిద్ధం చేశామని తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన లబ్దిదారులకు 10 లే అవుట్లలో, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన లబ్దిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాల్సిఉందన్నారు. ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అన్నిరకాల చర్యలు తీసుకుంటు-న్నామని చెప్పారు. జంగిల్‌ క్లియరెన్స్‌, ల్యాండ్‌ లెవలింగ్‌ పనులు పూర్తయ్యాయని, దాదాపు 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్‌ రోడ్లు వేసే పనులుకూడా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు అదనపు భవనం నిర్మాణం కూడా పూర్తవుతోందని 76,300 చదరపు అడుగులు విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటు-లోకి రానుందన్నారు. ఇందులో 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన చేపట్టామన్నారు.

సీఐటీ-ఐఐఎస్‌ కార్యక్రమం కింద 12 అర్భన్‌ ప్రాంతాల్లో పనులు చేపడుతున్నామని వెల్లడించారు. అనంతరం టిడ్కో ఇళ్లపైనా సీఎం ఆరాతీశారు. టిడ్కో ఇళ్లలో ఫేజ్‌ -1 కు సంబంధించి 1,50,000 ఇళ్లలో ఇప్పటికే 1.39 లక్షలు పూర్తయ్యాయని, 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లు అప్పగించామని అధికారులు తెలిపారు. జూన్‌ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగి ంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రెండో విడత 1,12,092 ఇళ్లను సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో లబ్ధిదారులకు అందించాలని నిర్దేశించారు. గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధంచేస్తున్నామని అధికారులు వివరించారు. జూన్‌ మొదటి వారంలో సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. విశాఖపట్నంలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటు-లో ఉంచాలన్నారు. వీటి ద్వారా బీచ్‌లో వ్యర్థాలను తొలగించాలని, – పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మరింత మెరుగుపడగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

విజయవాడలో కృష్ణానది వరద ముప్పు నుంచి తప్పించేందుకు నిర్మించిన రి-టైనింగ్‌ వాల్‌ ద్వారా ఏర్పాటుకానున్న రివర్‌ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. రివర్‌ బెడ్‌పై వాకింగ్‌ ట్రాక్‌ సహా చేపడుతున్న వివిధ బ్యూటిఫికేషన్‌ పనులను అధికారులు సీఎంకు వివరించారు.దీన్ని నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా సుందరీకరణ పనులు చేపట్టాలని సీఎం జగన్‌ సూచించారు. సమీక్షా సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్‌, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి బసంత్‌ కుమార్‌, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ సుబ్బారావు, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement