Friday, May 17, 2024

ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు.. ప‌క్క‌కు ఒరిగిన నాలుగు బోగీలు

ఓ గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి సిమెంట్‌తో కూడిన గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్‌ రైలుకు చెందిన నాలుగు బోగీలు పక్కకు ఒరిగాయి . దీంతో పట్టాల పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ మార్గంలో అదనపు లైన్ ఉండడంతో ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై ఎలాంటి ప్రభావం పడలేదు. పట్టాలు తప్పిన వెంటనే ట్రాక్‌ను క్లియర్ చేసే పనిని వెంటనే ప్రారంభించారు. ఘటనా విషయం తెలుసుకున్న రైల్వే డీఆర్‌ఎం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన జరిగిన సమయంలో రైలు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి సిమెంట్‌ను తీసుకెళ్తుందనీ, లైన్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ మార్గంగుండా రైలును అధికారులు రద్దు చేశారు. ట్రాక్‌ పునరుద్ధరణకు 36 గంటలు పట్టే అవకాశమున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మధ్యప్రదేశ్‌లోని కట్నీ స్టేషన్ సమీపంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement