Thursday, May 2, 2024

తిరుమ‌ల ఆనంద నిల‌యం వీడియో.. క‌రీంన‌గ‌ర్ వాసి అరెస్ట్

తిరుమలలోని ఆనంద నిలయంలో నిబంధనలకు విరుద్దంగా చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తుడు ఉధ్దేశపూర్వకంగానే ఆలయంలోకి మొభైట్ ఫోన్ తీసుకువెళ్ళినట్లుగా సీసీ పుటేజి ద్వారా గుర్తించామ‌న్నారు. భధ్రతా సిబ్బంది వైఫల్యం కారణంగానే ఘటన జరిగిందని భావిస్తున్నామ‌న్నారు ధర్మారెడ్డి. విచారణ తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామ‌ని ఈవో తెలిపారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామ‌ని ఈవో స్పష్టం చేశారు.

శ్రీవారి ఆనంద నిలయాన్ని రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ కి చెందిన రాహుల్ రెడ్డి అనే వ్యక్తి మొబైల్ ఫోన్ తో ఆనంద నిలయ గోపురాన్ని చిత్రికరించినట్లు పోలీసులు గుర్తించారు. మొబైల్ ఫోన్ ని ఆలయంలోకి ఉద్దేశ పూర్వకంగా రాహుల్ రెడ్డి తీసుకువెళ్ళినట్లు సీసీ ఫుటేజి ద్వారా పోలీసులు గుర్తించారు. నిందితుడి విజువల్స్ ని ఉద్దేశపూర్వకంగా వైరల్ చేసాడా ..లేక యాదృచ్చికంగా జరిగిందా అన్న దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement