Saturday, May 11, 2024

విద్యార్థుల భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త : ఏపీ మంత్రి సురేష్

కరోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో విద్యార్థుల ఆరోగ్య భద్రతకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ…. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. వచ్చే 15 రోజులు కరోనా ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో హాజరు శాతం గణనీయంగా పెరిగిందన్నారు.15 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని మంత్రి సురేష్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement