Friday, May 3, 2024

High Court – రింగ్ రోడ్డు కేసులో చంద్ర‌బాబు బెయిల్ పై విచార‌ణ రేప‌టికి వాయిదా

అమరావతి రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు. లేని రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుపై కేసు పెట్టారని ఆయన కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని ఆరోపించారు. మరోవైపు సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో విచారణను జడ్జి రేపటికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement