Monday, May 6, 2024

నరసరావుపేటను‘మహా పల్నాడు’జిల్లాగా మార్చండి: జీవీఎల్ లేఖ

ఏపీలో కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్యను 26కు పెంచనుంది. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు కూడా మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ కు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. నరసరావుపేట పార్లమెంట్ జిల్లాకు ‘గ్రేటర్ పల్నాడు’ లేదా ‘మహా పల్నాడు’ జిల్లాగా పేరు పెట్టాలని కోరారు. పార్లమెంట్ నియోజకవర్గాల తరహాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేయాలన్నారు. సమతుల్య అభివృద్ధి కోసం 26 జిల్లాలను రాష్ట్రంలో త్వరగా ఏర్పాటు చేయాలని జీవీఎల్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement