Tuesday, May 7, 2024

ఎపిలో ఇక గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ పగ్గాలు రెవెన్యూ చేతికి

అమ‌రావ‌తి – సచివాలయ వ్యవస్థ లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది రాష్ట్రప్రభుత్వం. రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేప‌ట్టింది.. దీనిలో భాగంగా ఇకపై సచివాలయ పరిపాలన పర్యవేక్షణ బాధ్యత ఆర్డీవో, తహాసిల్దార్ లకు అప్ప‌గించింది..సచివాలయ డి డి ఓ లు గా పంచాయతీ సెక్రటరీ లను తొలగించి విఆర్వో లకు అధికార పగ్గాలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రామ సచివాలయ పరిపాలన బాధ్యతలు వీఆర్వో లు ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌నున్నారు. ఇకపై గ్రామ సచివాలయంలో జరిగే నవరత్నాల సంక్షేమ పథకాల అమలు విఆర్వో ఆధ్వర్యంలో జరుగుతాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement