Tuesday, May 14, 2024

పెళ్లికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్ద‌రు మృతి..

ఎన్టీఆర్‌ జిల్లాలోని విసన్నపేట మండలం అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీ కొట్ట‌డంతో కారులోని ఇద్దరు గుప్తాలాల్‌(45), సునీత మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విపన్నపేటకు చెందిన ఓ కుటుంబం తెనాలిలో పెళ్లికి వెళ్లి వస్తుండగా కారు ప్రమాదానికి లోనయ్యింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement