Thursday, May 9, 2024

రూ.2కోట్ల విలువైన మ‌ద్యం ధ్వంసం

దాదాపు రూ.2కోట్ల విలువ చేసే మ‌ద్యం బాటిళ్ల‌ను ధ్వంసం చేసిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి చేరవేస్తున్న అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన 63 వేల మద్యం బాటిళ్లను పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ మద్యం అంతా గత రెండేండ్లుగా జిల్లాలో సీజ్‌ చేసినవి కావడం విశేషం. జిల్లాలోకి అక్రమంగా రవాణా చేస్తున్న అక్రమ మద్యం బాటిళ్లను ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గత రెండేండ్లుగా జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్‌ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని సీజ్‌ చేశారు. ఈరోజు విజయవాడ శివారులోని రోడ్డుపై అక్రమ మద్యం బాటిళ్లను వరుసగా పేర్చి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసిన మద్యం బాటిళ్లలో చీప్‌ లిక్కర్‌ మొదలుకొని కాస్ట్‌లీ మందు కూడా ఉండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement