Tuesday, May 7, 2024

న్యాయాన్ని బతికించేది న్యాయ మూర్తులే – సినీ దర్శకుడు దిలీప్ రాజా

తెనాలి,ఫిబ్రవరి 19 ప్రభ న్యూస్: అత్యంత కీలకమైన న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తులే ఆక్సిజన్ అని సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. స్తానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఆదివారం జరిగిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగంలోని చట్టాలను న్యాయమూర్తుల అమలు చేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిందిగా ఆయన న్యాయమూర్తులను కోరారు.తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి రామచంద్రుడు నిర్వహించిన ఈ అభినందన కార్యక్రమంలో పలువురు న్యాయ మూర్తులు పాల్గొని ప్రసంగించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాగద్వేషాలకు బంధుత్వాలుకు అతీత మయీ నదే న్యాయ వ్యవస్థ అన్నారు.ఎన్నో కీలకమైన కేసుల్లో నిర్నాయాలను తీసుకోవడం లో న్యాయమూర్తులు ఏంతో మానసిక సంఘర్షణకు గురి అవుతున్నారని చెప్పారు తెనాలిలో తనకి జరిగిన అభినందన సత్కారం మర్చిపోలేనిది తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయనను సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement