Tuesday, May 14, 2024

Guntur: జొన్నలగడ్డలో రైతు ఆత్మహత్య

గుంటూరు మండలం జొన్నలగడ్డలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు పాస్ పుస్తకాల్లో సర్వే నెంబర్ తప్పు పడిందని, సర్వే నెంబర్ సరిచేయాలని రైతు అధికారులను అడిగాడు. అయితే ఈ విషయంపై కలెక్టర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. మనస్తాపంతో రైతు ఆంజనేయులు ఇంటి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న రైతు బంధువులు జీజీహెచ్ ఆస్పత్రి దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement