Tuesday, May 7, 2024

అందుబాటులో లేని అత్యవసర సేవలు – క‌రోనా పేషంట్ మృతి.

తెనాలి : తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ తో పాటు ఇత‌ర‌ అత్యవసర సేవలు అందక నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా శివలూరుకు చెందిన యాండ్రపాటి రాజేంద్ర(50) నాలుగు రోజుల క్రితం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ నిమిత్తం జాయిన్ అయ్యారు . ఈ ఆసుపత్రిలో సరైన మందులు, ఇత‌ర అత్య‌వ‌స‌ర సౌక‌ర్యాలు లేకపోవ‌డంతో తుదిశ్వాస విడిచారు. సెర్ప్ లో ఇందిరాక్రాంతి పథకంలో సీసీ గా పనిచ్చేస్తున్నారు.ఇతనికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. హాస్ప‌ట‌ల్లో అత్య‌వ‌స‌ర సేవ‌లు లేక‌పోవ‌డం వ‌ల్లే రాజేంద్ర మ‌ర‌ణించారంటూ కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement