Saturday, April 27, 2024

చిల‌క‌లూరిపేట‌లో దారుణం.. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పంట పొలాల్లో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్య‌మైంది. మండలంలోని తాతపూడి పంచాయతీ పరిధిలో నేషనల్ హైవేకి ప‌క్కన ఉన్న శ్రీ భువనేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. తాతపూడి హైవే దగ్గర నుండి యద్దనపూడి మండలం సురవరపు గ్రామానికి వెళ్లే రోడ్డు దారిలోని మధ్య పొలంలో రాత్రి సమయంలో ఎవ‌రైనా ప‌డేసి వెళ్లి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీస్ సిబ్బంది వారు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ కు సమాచారం అందించారు. మహిళ వయసు 33 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. మహిళ మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement