Saturday, April 20, 2024

అజారుద్దీన్ ని పరామర్శించిన ..మంత్రి హరీశ్ రావు

రీసెంట్ గా అజారుద్దీన్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్ కన్నుమూశారు.. ఈ సందర్భంగా శనివారం హైదరాబాదులోని అజారుద్దీన్ నివాసానికి వెళ్లి తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. పితృవియోగ భాదనుంచి అజారుద్దీన్ త్వరగా కోలుకోవాలనిి ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా అజారుద్దీన్ తండ్రి అజిజుద్దీన్ సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ.. పరిస్థితి విషమించడంతో ఈ నెల 18న కన్నుమూశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement