Saturday, April 27, 2024

రైతుల కోసం మరో పథకం.. ఈనెల 7న వైఎస్సాఆర్‌ యంత్రసేవా పథకానికి శ్రీకారం..

అమరావతి, ఆంధ్రప్రభ : రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఈనెల 7 నుంచి డాక్టర్‌ వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈనెల 7న గుంటూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం సందర్బంగా వ్యవసాయ యంత్రాల మేళ నిర్వహించనున్నారు. ఈ పథకం కింద తొలివిడతలో రైతులకు 3,800 ట్రాక్టర్లు, 300 కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌ అందించను న్నారు. ఈనెల 7న తొలివిడతగా 1,215 ట్రాక్టర్లు, 77 కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌ను అందించనున్నారు. పథకం ప్రారంభోవ్తం సందర్భంగా నిర్వహించనున్న మేళా ఏర్పాట్లను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఈ మేరకు ట్రాక్టర్‌ కంపెనీల ప్రతినిధులతో పాటు- తొలివిడతలో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందుకోనున్న పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్టా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని లబ్దిదారులయిన రైతులతో అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు-చేసి విదివిధానాలను వివరిస్తున్నారు. మేళా నిర్వహించే ప్రాంతానికి ట్రాక్టర్లను ముందుగానే తీసుకురావాలనీ, ట్రాఫిక్‌ కు అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement