Sunday, April 28, 2024

Great Robbery – హైదరాబాద్‌, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ లలో భారీ దోపిడి….

ఒంగోలు – ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. సికింద్రాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ చేశారు. రైలులోని ఎస్‌2, ఎస్‌4, ఎస్‌6, ఎస్‌7, ఎస్‌8 బోగీల్లో అందినకాడికి దోచుకెళ్లారు.

అంతటితో ఆగని దొంగలు.. సికింద్రాబాద్‌ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో కూడా చోరీ చేశారు. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌1, ఎస్‌2 బోగీల్లో దొంగతనం చేశారు. అర్ధరాత్రి 1.20 నుంచి 1.50 గంటల మధ్య దోపిడీ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రయాణికులు వెళ్లడించారు. ఈమేరకు కావలి పోలీసులకు ఫిర్యాదుచేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement